రిమ్స్ మెడికల్ రెండో రోజు విద్యార్థుల నిరసన

సిరా న్యూస్,అదిలాబాద్;
అదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ మెడికల్ కళాశాల ఆవరణలో బుధవారం అర్ధరాత్రి ఘర్షణ కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని మెడికల్ విద్యార్థుల నిరసన చేపట్టారు. కళాశాల ఆవరణలో ఇంత పెద్ద ఘర్షణ చోటు చేసుకున్నటికీ రిమ్స్ డైరెక్టర్ ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వకపోవడాన్ని వారు తప్పు పట్టారు. రిమ్స్ హాస్పిటల్ వార్డులో ఎలుకలు తిరుగుతున్నాయని, సరైన వసతులు లేవని తాము రిమ్స్ డైరెక్టర్ ప్రశ్నించేందుకు తమపై దాడులు చేశారని వారు ఆపించారు. డైరక్టర్ బంధువైన అయిన అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతి తో కలిసి బయటి వ్యక్తులతో తమపై రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జై సింగ్ దాడి చేయించారని వారు ఆరోపించారు. తమపై దాడి చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *