సిరాన్యూస్, కడెం
బాధిత కుటుంబానికి పదో తరగతి బ్యాచ్ ఆర్థిక సాయం అందజేత
స్నేహానికన్న మిన్న లోకాన లేదురా, కడదాకా నీడలాగా నిను వీడి పోదురా ..అన్న కవి పాటకు ప్రాణం పోశారు కొందరు స్నేహితులు. నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని పెద్దూర్ తండాకు చెందిన స్నేహితుడు ఫోటో గ్రాఫర్ సుధాకర్ ఆనారోగ్యంతో మరణించారు. 2009 ఎస్సెస్సి క్లాస్ మేట్ బ్యాచ్ కు చెందిన కడెం పెద్దూర్ యువకులు శోకసంద్రంలో ఉన్న స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచారు.20 వేల నగదు పోగు చేసి మృతుడి భార్య రజిత కు అందించారు. అతని అకాల మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ పరామర్శలో క్లాస్మేట్స్ శ్రీరామ్, ప్రశాంత్, అంజన్న, మనోజ్, నాగరాజు, భాను గ్రామ పెద్దలు మోహన్ నాయక్, రాజేంధర్ హపావత్ ,గంగారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.