సిరా న్యూస్, భీమదేవరపల్లి
ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నాయకుడు కేసీఆర్
* జిల్లా జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్
* ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నాయకుడు కేసీఆర్ అని జిల్లా జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ అన్నారు. శనివారం తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు 70 వ జన్మదిన వేడుకలను భీమదేవరపల్లి మండల పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ముల్కనూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పోషించిన పాత్ర గురించి వర్ణించలేనిదని, ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జక్కుల అనిత, జడ్పిటిసి వంగ రవి, మండల సీనియర్ పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు, కెసిఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.