సిరాన్యూస్, భీమదేవరపల్లి
వరంగల్ బీఆర్ఎస్ ఎంపీగా అభ్యర్థిగా డాక్టర్. మారేపల్లి సుధీర్ కుమార్
* ప్రకటించిన కేసీఆర్
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుండి పార్టీ అభ్యర్థిగా డాక్టర్. మారేపల్లి సుధీర్ కుమార్ ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామానికి చెందిన సుధీర్ కుమార్, మాదిగ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. ఎల్కతుర్తి మండలం నుండి జెడ్పిటిసిగా గెలుపొంది ప్రస్తుతం హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. 2001 నుండి తెలంగాణ ఉద్యమకారుడిగా, పార్టీ కి విధేయుడుగా, అధినేతతో కలిసి పనిచేస్తున్న సుధీర్ కుమార్ సరైన అభ్యర్ధిగా ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ మేరకు అందరితో చర్చించి వారి సలహా సూచనలమేరకు అధినేత కేసీఆర్, సుధీర్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ప్రకటించారు. సుధీర్ కుమార్ కు ఎంపీ టికెట్ రావడం పట్ల భీమదేవరపల్లి, మండలాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.