Sudhir Kumar Sangem: సుధీర్ కుమార్ కు తెలంగాణ స్పూర్తి పురస్కారం

సిరాన్యూస్‌, ఆదిలాబాద్
న్యాయవాది సుధీర్ కుమార్ సంగెంకు తెలంగాణ స్పూర్తి పురస్కారం
* ఘ‌నంగా అవార్డు ప్రదానోత్సవం

ఆదిలాబాద్ కు చెందిన ప్రముఖ న్యాయ‌వాది సుధీర్ కుమార్ సంగెంకు తెలంగాణ స్ఫూర్తి పురస్కారం వరించింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని తెలంగాణ మలి దశ ఉద్యమంలో పాల్గొన్న కవులు, కళాకారులు, న్యాయవాదులు, ఉద్యమ కారులకు హైదరాబాద్ మహానగరం లోని సుప్రసిద్ధ త్యాగరాయ గానసభలో తెలుగు భాషా సంస్కృతిక శాఖ, సత్య సంగీత ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సంయుక్తంగా తెలంగాణ స్ఫూర్తి అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, బీసీ కమిషన్ చైర్మన్ వాకులాభారణం కృష్ణ మోహన్, సత్య సంగీత ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఓంకార్ రాజు, శైలజ, ప్రముఖ సినీ తారలు శైలిమ, ఊర్వశి, తదితరులు పాల్గొని న్యాయవాది సుధీర్ కుమార్ సంగెం కు అవార్డును ప్రధానం చేసి శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సంద‌ర్బంగా సుధీర్ కుమార్ సంగెం మాట్లాడుతూ… ఈ అవార్డు రావడం తనను వరించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ అవార్డు తనపై మరింత బాధ్యత పెంచిందని, రానున్న రోజుల్లో సంగెం ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తామని అన్నారు. కాగా అవార్డు అందుకున్న ఆయన్ను పలువురు న్యాయవాదులు నాయకులు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *