సిరాన్యూస్, ఆదిలాబాద్
మహిళలు అన్ని రంగాల్లో పురోగతి సాధించాలి
* బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి
* ఘనంగా మహిళ దినోత్సవం
మహిళలు అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, మాజీ జిల్లాపరిషత్ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి అన్నారు. శుక్రవారం మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మహిళల శక్తి సామర్థ్యాలను గుర్తించినప్పుడే ప్రపంచం అభివృద్ధి వైపు అడుగులేస్తోందని చెప్పారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను అందిపుచ్చుకొని మహిళను మరింత ముందుకు వెళ్లాలని సూచించారు.అంతకు ముందు పాఠశాల యాజమాన్యం ఆమెను శాలువాతో సత్కరించారు.