Suhasini Reddy:విశ్వకర్మల అభివృద్ధి కోసం కేంద్రం ప‌థ‌కాలు

సిరాన్యూస్‌,ఆదిలాబాద్‌
విశ్వకర్మల అభివృద్ధి కోసం కేంద్రం ప‌థ‌కాలు
* బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి
విశ్వకర్మల అభివృద్ధి కోసం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి అన్నారు. బుదవారం ఆదిలాబాద్ పట్టణంలోని ఆమె నివాసంలో శ్రీ విశ్వకర్మ ఝాడే సుతార్ మరాఠీ సమాజ్ సంక్షేమం సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన ఆమె కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *