సిరాన్యూస్, బేల
సత్సంగ్ కార్యక్రమాలతో గ్రామాలలో ఆధ్యాత్మికత
* బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి
ఆదిలాబాద్ జిల్లా బేల మండలం అవాల్ పూర్ గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ పరమహంస సద్గురు పూలాజి బాబా 3వ ఆధ్యాత్మిక సత్సంగ్ వార్షిక మహోత్సవ కార్యక్రమం వైభవంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా సత్సంగ్ చివరి రోజు మంగళవారం వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ సత్సంగ్ కార్యక్రమాల ద్వారా గ్రామాలలో ఆధ్యాత్మికత చోటు చేసుకుంటుందని పేర్కొన్నారు.