Suhasini Reddy: టెట్ పరీక్ష ఫీజును వెంట‌నే త‌గ్గించాలి : సుహాసినిరెడ్డి

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
టెట్ పరీక్ష ఫీజును వెంట‌నే త‌గ్గించాలి : సుహాసినిరెడ్డి

టెట్ ప‌రీక్ష ఫీజును వెంట‌నే త‌గ్గించాల‌ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి అన్నారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని శుక్ర‌వారం ఆమె ఒక ప్ర‌క‌ట‌న‌లో డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క‌టించ‌లేద‌న్నారు. సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న పేద, మధ్యతరగతి నిరుద్యోగుల నుంచి టెట్ పరీక్ష పేరిట అధిక ఫీజులు వసూలు చేయ‌డం స‌రికాద‌న్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే పరీక్ష రుసుమును వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *