Suhasini Reddy: కేంద్ర ప్ర‌భుత్వం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

సిరాన్యూస్‌,ఆదిలాబాద్‌
కేంద్ర ప్ర‌భుత్వం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
* బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి
* కైలాష్‌న‌గ‌ర్ కాల‌నీలో బీజేపీ పార్టీ ఆవిర్భావ వేడుకలు

మొదట దేశం, తరువాత పార్టీ, తరువాత వ్యక్తి అనే భావనతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు,మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి అన్నారు.శనివారం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కైలాష్ నగర్ కాలని లోని బూత్ కమిటీల అధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు సుహాసిని రెడ్డి గారి నివాసంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం టిఫిన్ బైటక్ కార్యక్రమం నిర్వహించారు .ఈ సందర్బంగా సుహాసిని రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల‌న్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేసి పార్టీని మరో సారి అధికారం లోకి తీసుకురావాలని, అటు బూత్ స్థాయిలో పార్టీనీ బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో శక్తి కమిటీ అధ్యక్షులు రాకేష్, బూత్ కమిటీ అధ్యక్షులు హరీష్, అనిల్, రమేష్, పార్టీ సీనియర్ నాయకులు గందే విజయ్ కుమార్, నారాయణ రెడ్డి, నితిన్ పటేల్, విలాస్ రెడ్డి, జిల్ల అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి, మహిళా నాయకురాలు కాంత, అనిత, నాయకులు పవన్, ప్రవీణ్ అగర్వాల్, రాహుల్, అనిల్, రాజు, నరేష్, దీపక్ సింగ్ తదితరులు ఉన్నారు..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *