సిరాన్యూస్, ఆదిలాబాద్
ఛత్రపతి శివాజీని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి
* బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి
* ఛత్రపతిశివాజీ విగ్రహం ఆవిష్కరణ
ఛత్రపతి శివాజీని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మాంగ్రూడ్ గ్రామంలో గ్రామస్తుల ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతిశివాజీ మహారాజ్ నూతన విగ్రహన్ని సోమవారం ఆమె ఆవిష్కరించారు.అంతకుముందు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామస్తులు సుహాసిని రెడ్డిని ఘనంగా సన్మానించారు. హైందవ సంస్కృతి కీర్తి పతాక శివాజీ అని ఆమె పేర్కొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడారు. సమాజహితం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన చత్రపతి శివాజీ మహారాజ్ జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.