సిరా న్యూస్, మంచిర్యాల
మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలి
* బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి
* మంచిర్యాలలో సన్నాహక సమావేశం
ప్రధానమంత్రి నరేంద్రమోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు,మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి పిలుపు నిచ్చారు.శనివారం మంచిర్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయం లో నరేంద్ర మోడీ గ సభ సన్నాహక సమావేశంలో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 4 వ తేదీన ప్రధానమంత్రి హోదాలో అదిలాబాద్ జిల్లాకి మొదటి సారి విచ్చేసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనచేసిన అనంతరం ,ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగే బహిరంగ సభలో ప్రధాన మంత్రి పాల్గొంటారని తెలిపారు.బిజెపి కార్యకర్తలు,ప్రజలు, స్వ చ్చందం గా హాజరై విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ రావు,పెద్దపెల్లి పార్లమెంట్ ప్రభారి కొప్పుల భాష, మాజీ శాసన సభ్యురాలు శ్రీదేవి, జిల్లా, మండలాల నాయకులు పాల్గొన్నారు.