సిరా న్యూస్, జైనథ్
ఆధ్యాత్మికతలోనే మానసిక ప్రశాంతత
* బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి
* ఘనంగా సప్తహ వేడుకలు
ఆధ్యాత్మికతలోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం మాండగడ గ్రామంలో శ్రీ సద్గురు బాజీరావ్ మహారాజ్ భవ్య జ్ఞానేశ్వరి పారాయణ సప్తహ వేడుకలు ఘనంగా కొనసాగాయి. బుధవారం సప్తహ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సప్తహ కార్యక్రమాలతో గ్రామాలలో ఆధ్యాత్మికత వెళ్ళు విరుస్తుందని పేర్కొన్నారు. ఆధ్యాత్మికతలోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు