సిరా న్యూస్, ఆదిలాబాద్
మహిళల కోసం బీజేపీ అనేక పథకాలు
* శక్తి వందన్ కార్యక్రమం రాష్ట్ర సమన్వయ కర్త సుహాసిని రెడ్డి
* శక్తి వందన్ కార్యక్రమం
మహిళా సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్న ఘనత భారతీయ జనతా పార్టీ కే దక్కుతుందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు,శక్తి వందన్ కార్యక్రమం రాష్ట్ర సమన్వయ కర్త సుహాసిని రెడ్డి అన్నారు.బుదవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ఫంక్షన్ హల్ లో శక్తి వందన్ కార్యక్రమం లో భాగంగా స్వయం సహాయక సంఘాలు,ఎన్ జీ ఓలతో కలిసి వర్చువల్ విధానం ద్వారా నరేంద్ర మోడీ ప్రసంగాన్ని విన్నారు.మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల గురించి ఆమె మహిళలకు వివరించారు.ఈ కార్యక్రమం లో స్థానిక శాసన సభ్యులు పాయల్ శంకర్,మహిళ మోర్చా జిల్ల అధ్యక్షురాలు జ్యోతి, పార్లమెంట్ కో కన్వీనర్ మయూర్ చంద్ర, అసెంబ్లీ కన్వీనర్ బోయర్ విజయ్, జిల్లా, మండలాల మహిళా నాయకురాల్లు పాల్గొన్నారు.