Suicide: పురుగుల మందు తాగి పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

దండేపల్లి, సిరా న్యూస్ 

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మామిడిపెళ్లి గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి బలుగురి నీలేష్(15) మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య కు పాల్పడ్డాడు. స్థానిక పోలీసులు తెలిపిన ప్రకారం మృతుడు నీలేష్ తల్లితండ్రులు చిన్నతనం లోనే మృతి చెందడంతో వృద్ధురాలైన నానమ్మ వద్ద ఉంటున్నాడు. ఓ పక్క మామిడిపెళ్లి లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకుంటూ సాయంత్రం వేళ మేదరిపేట లోని మిర్చి బండి వద్ద పనిచేస్తున్నాడు.ఈ క్రమంలో నానమ్మకు భారం కావద్దని, తల్లిదండ్రులు లేరనే మానసిక క్షోభ కు గురై మిర్చిబండి దగ్గర నుంచి వచ్చాక  గురువారం రాత్రి పురుగుల మందు తాగాడు. వెంటనే చికిత్స నిమిత్తం లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *