సిరాన్యూస్, ఆదిలాబాద్
కాంగ్రెస్ అభ్యర్థి సుగుణను ఎంపీ గా గెలిపించండి : గండ్రత్ సుజాత
కాంగ్రెస్ అభ్యర్థి సుగుణను ఎంపీ గా గెలిపించాలని మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, అల్లూరి సంజీవ్ రెడ్డి అన్నారు. గురువారం ఆదిలాబాద్ మండలం లోని తంతొలి, ఆంకోలి, లోకారి గ్రామాలల్లో ఉపాధిహమీ కూలీలను కలిసి కాంగ్రెస్ అభ్యర్థి సుగుణను ఎంపీ గా గెలిపించాలని కోరారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధిహమీ కూలీలకు కేంద్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 400 పెంచుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.