సిరా న్యూస్,హైదరాబాద్;
ఉస్మానియా యూనివర్సిటీ పోస్ట్ ఆఫీస్ ప్రధాన కార్యాలయంలో స్ఫూర్తి కార్యక్రమం ద్వారా 2024 యూపీఎస్సీ తెలుగు రాష్ట్రాల ర్యాంకర్స్ 105 నిరుపేద ఆడపిల్లలకు ఖాతాను ఓపెన్ చేసి వారి ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నరసింహారెడ్డి (ఐఆర్ఎస్), యుపిఎస్సి 03 వ ర్యాంకర్ అనన్య రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2006 లో మొట్టమొదటిసారిగా యూపీఎస్సీ తెలుగు ర్యాంకర్స్ గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదవారిని ప్రోత్సహిస్తూ వారికి ఆర్థికంగా సహాయం చేస్తున్నాము అన్నారు. ఇప్పటివరకు రెండు లక్షల మందికి సహాయం చేస్తూ స్ఫూర్తిని కలిగిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం భిన్నంగా సుకన్య సమృద్ధి యోజన ద్వారా నిరుపేద ఆడపిల్లలకు పోస్ట్ ఆఫీస్ లో ఖాతాను ఓపెన్ చేసి 1000 రూపాయల డిపాజిట్ 105 మందికి చేశాము అన్నారు
Glorice Glosser