సిరాన్యూస్, ఆదిలాబాద్
ప్రభుత్వానికి కృతజ్ఞతలు : హిందీ భాషా సేవా సమితి జిల్లా అధ్యక్షులు సుకుమార్ పెట్కులే
ఎన్నో ఏళ్లుగా అన్ని అర్హతలు ఉండి గ్రేట్ టు భాషా పండితులుగా వెట్టిచాకిరి చేస్తున్న భాషా పండితులకి న్యాయం చేస్తూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని అర్హతలు ఉన్న పండితులందరికీ ప్రమోషన్లు ,హిందీ స్కూల్ అసిస్టెంట్లుగా కల్పించి న్యాయం చేసిన ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి హిందీ భాషా సేవా సమితి జిల్లా అధ్యక్షులు సుకుమార్ పేట్కులే ఉపాధ్యక్షులు రవి జాబాడేలు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పాత్రికేయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత 22 సంవత్సరాలుగా తమను గ్రేడ్ వన్ హిందీ స్కూల్ అసిస్టెంట్ భాషా పండితులుగా గుర్తించాలని, న్యాయ పోరాటం చేస్తున్న పండితుల పక్షాన నిలబడి వేల మంది పండితులకి ప్రమోషన్లు కల్పించి న్యాయం చేసినందుకు హిందీ భాష సేవా సమితి తరపున కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పదోన్నతి పొందిన పండిత, పీఈటీ లందరూ ఆగస్టు రెండున ఎల్బీ స్టేడియం హైదరాబాదులో జరిగే ముఖ్యమంత్రి కృతజ్ఞత సభకు అందరూ హాజరై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ విద్యావ్యవస్థ పటిష్టానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఆర్పీవై.వినాయక్, హిందీ స్కూల్ అసిస్టెంట్లు ఎన్.శంకర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.