Sukumar Petkule:విగ్రహాలను ధ్వంసం చేసిన నిందితున్ని ఉరితీయాలి

సిరా న్యూస్, ఆదిలాబాద్‌
 విగ్రహాలను ధ్వంసం చేసిన నిందితున్ని ఉరితీయాలి
* అనాలోచితంగా అలజడులు సృష్టించే ప్రయత్నం చేయొద్దు
* మాలి మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బోరపల్లి గ్రామంలో ఉన్న సామాజిక ఉద్యమ పితామహుడు మహాత్మ జ్యోతిరావు పూలే, భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసిన నిందితుల్ని అరెస్టు చేసి వెంటనే ఉరిశిక్షపడేలా చేయాలని అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఫూలే దంపతులు ఈ దేశ సామాజిక మార్పు కోసం బహుజన కులాల అభ్యున్నతి కోసం, స్త్రీ విద్యా, స్త్రీ సాధికారత కోసం ఆజన్మాంతం కృషిచేసిన మహోన్నత వ్యక్తులని అలాంటి మహనీయులను కించపరిచిన వ్యక్తుల్ని, ఆయన్ని ప్రోత్సహించిన వారిని గుర్తించి ఉరిశిక్షపడేలా సెక్షన్లు విధించి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మాలి సంక్షేమ సంఘం సభ్యులంతా మీ మీ మండలాల్లో ఉన్న పోలీస్ స్టేషన్ లలో కేసు నమోదు చేసి శిక్షించాలని వినతి పత్రాలు ఎస్సైలకు సమర్పించాలని, అవసరమైతే ప్రధాన వీధులల్లో ధర్నాలు, రాస్తారోకోలు చేయాలని అన్నారు. ప్రగతి భవన్ పేరును మహాత్మ జ్యోతిరావు ఫూలే ప్రజాభవంగా మార్చిన ప్రభుత్వం పులే దంపతులకు ఇంత అవమానం జరిగినప్పుడు వెంటనే స్పందించి నిందితులను కఠినాతి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు లేనియెడల సంఘపరంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉద్యమాల్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మహాత్మ జ్యోతిరావు పూలే దంపతులు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఏ రోజు పనిచేయలేదని కొంతమంది కావాలని ఫూలే దంపతులను హిందూ వ్యతిరేకంగా చిత్రీకరించి సమాజంలో ఆలుజడులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని జ్యోతిరావు పూలే దంపతులు హిందూ ధర్మంలో ఉన్న మూఢనమ్మకాలు కొన్ని అనాగరిక పద్ధతుల్ని మాత్రమే వారు వ్యతిరేకరించారని అందుకోసమే సత్యశోధక సమాజాన్ని స్థాపించి వారు “సార్వజనిక సత్య ధర్మ” పుస్తకాన్ని రాశారని ఆ పుస్తకం చదివితే ఫూలే ధర్మతుల్ని అర్థం చేసుకోగలుగుతామని అన్నారు. అంతే తప్ప అనాలోచితంగా అలజడులు సృష్టించే ప్రయత్నం చేస్తే ఫూలే వారసులుగా బహుజన బిడ్డలుగా ఊరుకోబోమని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *