Sukumar Petkule: ఇటికల్ పహాడ్ గ్రామస్తులను ఆదుకోండి

సిరాన్యూస్ ,ఆదిలాబాద్‌
ఇటికల్ పహాడ్ గ్రామస్తులను ఆదుకోండి
* మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ. మండలం లోని ఇటుకల్ పహాడ్ గ్రామస్తులను ఆదుకోవాలని అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పూలే గెస్ట్ హౌస్ లో మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా గ్రామాన్ని ఏర్పరచుకొని పోడు భూములను సాగు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్న గ్రామస్తులను అటవీ అధికారులు రిజర్ఫార్వెస్ట్ భూమి పేరట ఇబ్బందులకు గురి చేస్తూ అక్కడ మొక్కలు నాటుతామని అనడం సరికాదని ఏళ్ల తరబడి నివాసం ఉంటూ పోడు భూములను సాగు చేసుకుంటున్న మాలీ కులస్తులకు వేరే జీవీణాధారం ఏది లేదని, దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ యంత్రాంగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వాళ్లు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇప్పించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ గ్రామంలో 200 కుటుంబాలు 700 మంది నివాసముంటున్నారు. వారిని ఉన్న ఫలంగా ఊరు ఖాళీ చేసి వెళ్ళమంటే వారు ఎక్కడికి వెళ్లాలి, ఏమి చేసుకుని బ్రతకాలి? ఇటికల పహాడ్ గ్రామంలోని వారు ఆధార్ కార్డు పొందారు, కరెంట్ బిల్లులు కట్టుతున్నారు, ఇల్లు కట్టుకున్నారు ఇళ్లకు టాక్స్లు చెల్లిస్తున్నారు. మరి అలాంటప్పుడు ప్రభుత్వం అందించే ప్రతి పథకాలన్ని పొందుతున్న వీరు ఊరు ఖాళీ చేసి వెళ్ళమంటే సాగు చేసుకుంటున్న పోడు భూములు సైతం వదులు పోవాలంటే వారి బతుకులు బజారున పడతాయి. కాబట్టి ప్రభుత్వాలు మానవతా దృక్పథంతో ఆలోచించి వారి వ్యవసాయ భూముల్లో చెట్లు నాటే కార్యక్రమాన్ని విరమించుకోవాలని, వారి సాగు చేస్తున్న పోడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *