సిరాన్యూస్, కోనరావుపేట :
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీ జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు అధికారులకు సూచించారు. శనివారం కోనరావుపేట మండలంలోని కనగర్తి గ్రామాన్ని జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తగా ప్రతి ఇంటిని సందర్శించి తీసుకొనే జాగ్రత్తల గురించి సిబ్బందికి సూచించారు. ఫీవర్ సర్వే ప్రతి రోజు చేయాలని సూచించారు . కార్యక్రమంలో డా. వేణు మాధవ్, ఆరోగ్య విస్తరణ అధికారి లింగం ,సూపర్ వైజర్ రషీద్ , ఏఎన్ఏం సరోజన ,పంచాయతీ కార్యదర్శి కవిత, ఆశాలు పాల్గొన్నారు.