సిరాన్యూస్,ఓదెల
దంచికొడుతున్న ఎండలు..
* నిర్మానుష్యంగా మారిన ప్రధాన కూడలి
ఎండలు ముదరడంతో ప్రజలు బయట తిరగాలంటేనే జంకుతున్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్ర ప్రధాన కూడలి రంగుల దుకాణం సెంటర్ ,బట్టల బజార్ నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతం గురువారం ఉదయం 10. 20 నిమిషాలకే జనాలు లేక నిర్మానుష్యంగా మారింది . రానున్న రోజుల్లో దంచి కొట్టే ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన వాతావరణ శాఖ సూచిస్తుంది. ప్రధాన కూడలి వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.