సిరాన్యూస్, చిగురుమామిడి
నాంసానీపల్లి లో ఎండలపై డప్పు చాటింపు
దంచికొడుతున్న ఎండలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ శుక్రవారం ఓదెల మండలంలోని నాంసా నీ పల్లి గ్రామంలో డప్పు చాటింపు నిర్వహించారు. ప్రజలు ఉదయం 10 గంటలనుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఇంటి నుండి ఎవరు బయటికి రాకూడదని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఎవరు రాకూడదని హెచ్చరించారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిదని డప్పు చాటింపు చేశారు.