Sunil Kumar: 10న నిర్మల్ జిల్లా కేంద్రానికి మందకృష్ణ మాదిగ

సిరా న్యూస్,బేల
10న నిర్మల్ జిల్లా కేంద్రానికి మందకృష్ణ మాదిగ
* ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు అడ్డికి సునీల్ కుమార్
ఈనెల 10న నిర్మల్ జిల్లా కేంద్రానికి మందకృష్ణ మాదిగ రానున్నార‌ని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు అడ్డికి సునీల్ కుమార్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. పార్లమెంటరి సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ వస్తున్న సందర్బంగా మండల కేంద్రంలో గల యం.ఆర్.పి.ఎస్., అనుబంధ సంఘాలు ఈ సమీక్షా సమావేశానికి ప్రతిఒక్కరు పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యం.ఆర్.పి.ఎస్ మండల ఉపాధ్యక్షుడు మేకల దీపక్, గౌరవ అధ్యక్షుడు పెంటపర్తి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి మేకల జితేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *