సిరా న్యూస్, బోథ్
సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ
బోథ్ మండలంలోని ఘనపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఎన్ఆర్ఈజీఎస్ మూడు లక్షల రూపాయలు మంజూరు కావడంతో ఆ నిధుల తో సిసి రోడ్డు నిర్మాణానికి శుక్రవారం గ్రామ ఎంపీటీసీ సునీత రోహిదాస్ భూమి పూజ చేశారు. ఈసందర్భంగా ఎంపీటీసీ మాట్లాడుతూ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ ఎంపీపీ తుల శ్రీనివాస్ సహకారంతో నిధులు మంజూరు కావడం జరిగింది అన్నారు. గ్రామాభివృద్ధికి గ్రామస్తులు కలిసికట్టుగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో రాథోడ్ సుదర్శన్, సత్య నారాయణ, కానీ రామ్ గుండె రావు, విక్రమ్, కే సంతోష్లు పాల్గొన్నారు