సిరాన్యూస్, తలమడుగు
సుంకిడిలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
రైతు రుణమాఫీకి క్యాబినెట్ ఆమోదం తెలిపినందున ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు, రైతులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈసందర్భంగా తలమడుగు జడ్పిటిసి గోక గణేష్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కళ్యాణం రాజేశ్వర్లు మాట్లాడారు. క్యాబినెట్లో ఏకకాలంలో రుణమాఫీ చేసేందుకు తీర్మానించినందుకు పాలాభిషేకం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బాబాన్నా, మాజీ సింగిల్ విండో చైర్మన్ ప్రకాష్ రావు, గోక భూమా రెడ్డి, ఎంపీటీసీలు రమేష్ రెడ్డి, కమలకర్, వెంకన్న యాదవ్, కో ఆప్షన్ మెంబర్ బాబు ఖాన్, మాజీ సర్పంచ్లు, మండల కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.