సిరాన్యూస్, తలమడుగు
సుంకిడి పాఠశాలలో ఘనంగా స్పేస్ డే
అంతరిక్షంలోకి భారత్ ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3ను విజయవంతంగా పంపిన రోజును పురస్కరించుకొని శుక్రవారం
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని సుంకిడి ఉన్నత పాఠశాలలో క్రీడా మైదానంలో స్పేస్ డే నిర్వహించారు. ఈసందర్బంగా ఐ ఎస్ ఆర్ ఓ అక్షరాలను 130 మంది విద్యార్థినీ విద్యార్థులు ఏర్పాటు చేశారు. అనంతరం జయహో ఇస్రో నినాదాలతో హోరెత్తించారు. ఆ తర్వాత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు చంద్రయాన్ 3 పై ఉపన్యాసం, వ్యాసరచన పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ స్వామి, రామ్ రెడ్డి, గజానన్, సుకుమార్ పెట్కులే సుజాత టీచర్, సంజీవ్ రెడ్డి, పీడీ నాందేవ్ తదితరులు పాల్గొన్నారు.