సిరా న్యూస్,విజయవాడ;
ఏపీలో పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 22న వెలువడిన సంగతి తెలిసిందే. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది పదోతరగతి పరీక్షల ఫలితాల్లో మొత్తం 86.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. . పాసైనవారిలో 89.17 శాతం బాలికలు, 84.32 శాతం బాలురు ఉత్తీర్ణులయ్యారు. పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 24 నుంచి జూన్ 3 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు