సిరా న్యూస్, తాంసి:
సురేందర్ రెడ్డిని కలిసిన కంది శ్రీనివాస్, అడ్ది భోజారెడ్డి
కాంగ్రెస్ పార్టి ఆదిలాబాద్ నియోజక వర్గ ఇంచార్జీ కంది శ్రీనివాస రెడ్డి, డీసీసీబీ చైర్మెన్ అడ్డి భోజారెడ్డి, తదితరులు కాంగ్రెస్ నాయకులు కామాయి సురేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శనివారం సాయంత్రం ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని జామిడి గ్రామంలో సురేందర్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సురేందర్ రెడ్డి మనువరాలిని కాసేపు ఎత్తుకొని లాలించి, ఆశీర్వదించారు. వారి వెంట నాయకులు బాయిన్వార్ గంగారెడ్డి, ఖయ్యుం, తదితరులు ఉన్నారు.