సిరాన్యూస్,భీమదేవరపల్లి
వీరభద్ర స్వామి ఆలయాన్నిదర్శించుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు సురేందర్ రెడ్డి
భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలోని ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధి చెందిన వీరభద్ర స్వామి ఆలయాన్ని బుధవారం బీజేపీ రాష్ట్ర నాయకులు జన్నపురెడ్డి సురేందర్ దర్శించుకున్నారు. ఈ సందర్బంగా బుధవారం సురేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు కావడంతో గుడి ఆవరణలో ఆయనను కలిసేందుకు బీజేపీ కార్యకర్తలు, సురేందర్ రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దీంతో కొత్తకొండ గ్రామం జనసంద్రంలా మారింది ఈ సందర్బంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ అభిమానులతో, కార్యకర్తలతో కలిసి స్వామి వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.