Surender Reddy: వీరభద్ర స్వామి ఆలయాన్నిద‌ర్శించుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు సురేందర్ రెడ్డి

సిరాన్యూస్‌,భీమదేవరపల్లి
వీరభద్ర స్వామి ఆలయాన్నిద‌ర్శించుకున్న బీజేపీ రాష్ట్ర నాయకులు సురేందర్ రెడ్డి

భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలోని ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధి చెందిన వీరభద్ర స్వామి ఆలయాన్ని బుధ‌వారం బీజేపీ రాష్ట్ర నాయకులు జన్నపురెడ్డి సురేందర్ దర్శించుకున్నారు. ఈ సందర్బంగా బుధ‌వారం సురేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు కావడంతో గుడి ఆవరణలో ఆయ‌న‌ను క‌లిసేందుకు బీజేపీ కార్యకర్తలు, సురేందర్ రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజ‌ర‌య్యారు. దీంతో కొత్తకొండ గ్రామం జనసంద్రంలా మారింది ఈ సందర్బంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ అభిమానులతో, కార్యకర్తలతో కలిసి స్వామి వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *