Surendra Babu: మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తా

సిరాన్యూస్‌, కళ్యాణదుర్గం
మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తా
ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు
టికెట్ రాలేదనే ఉమా మహేశ్వర్ నాయుడు పార్టీ మారాడు

పార్టీ లో ఎవరిని కలుపుకోక పోవడం తోనే ఇంచార్జ్ మార్పు జరిగింద‌ని ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. సోమ‌వారం ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ టికెట్ రాలేదనే ఉమా మహేశ్వర్ నాయుడు పార్టీ మారాడని, తెలుగుదేశం పార్టీ నమ్మి టికెట్ ఇస్తే నిలబెట్టుకోలేక పార్టీ వర్గాలను కలుపుకోలేక పోయారని తెలిపారు. పార్టీ నమ్మి బాధ్యతలు అప్పాజెప్పితే ఇలా పార్టీని వదిలి వెళ్లడం అహంకారం తో ఉండడం సమంజసం కాదన్నారు. ఉమా పార్టీ మార్పు పై మరో సారి పూర్తిగా మాట్లాడుతా అని అన్నారు. మొదట అభివృద్ధి పై మాత్రమే ఆలోచిస్తాను అని మున్సిపాలిటీ అభివృద్ధి కి తన వంతుగా కృషి చేస్తా అన్నారు. మున్సిపాలిటీలో అందరిని కలుపుకొని అందరి సలహాలతో ముందుకు వెళ్తా అన్నారు. పార్టీ లో చేరిన వారిపై కావాలని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, వారందరికీ అండగా ఉంటామన్నారు. మున్సిపాలిటీ లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనుమతి తీసుకొని వారు ప్లాట్లు వేసుకోవచ్చు అన్నారు. నేను లంచం అనే పదానికి తావు లేకుండా చేస్తా అన్నారు. వైసీపీ మాదిరి డబ్బులు వసూలు చేయమని నిజాయితీ గా పని చేస్తా అన్నారు. సైకిల్ గుర్తుకే మీ ఓటు వేయాలని అభ్యర్థించారు. కార్యక్రమం లో మున్సిపాలిటీలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *