సిరాన్యూస్,కుందుర్పి
నామినేషన్ రోజున వైసీపీకి షాక్
* కుందుర్పి మండలం నుండి భారీగా టీడీపీలో చేరిక
అనంతపురం జిల్లా కుందుర్పి మండలం బెస్తరపల్లి, బొమ్మజ్జిపల్లి గ్రామాల నుండి వైఎస్సార్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ కండువా వేసుకున్నారు. కుందుర్పి మండల టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు వారికీ కండువా వేసి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కుందుర్పి మండలం బెస్తరపల్లి గ్రామం నుంచి 40 కుటుంబాలు, బొమ్మజ్జిపల్లి గ్రామానికి చెందిన 15 కుటుంబాలు వైఎస్సార్ పార్టీ నుండి టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పరశురాంపురం లక్ష్మన్న, పరుశురాంపురం శీనా, పరుశురాంపురం జితేంద్ర, పి నగేష్, ఆగలి శ్రీరాములు, ఆగలి రవి, అగలి తిమ్మరాజు, ఆగలి పవన్, బాబు, ఏ సురేష్, కమ్మ వెంకటేష్, బి మల్లికార్జున, బీకే నగేష్, బీకే భూపతి, బీకే శ్రీనివాసులు, వై నాగేంద్ర, ఏ చంద్ర, అర్లపల్లి రామాంజినేయులు, బీకే రమేష్, బీకే శ్రీనివాసులు, బీకే గోపాల్, భుజ బాబు, ఈరంపల్లి యల్లప్ప, బివి వెంకటేష్, ఆగలి లోకేష్, కే తేజ, నింగమ్మయ్యగారి ఈరన్న, బిటి రామచంద్ర, చాకలి చంద్ర, హంపాయ్యగారి రాజప్ప, వై జగదీష్, పార్వతమ్మ, ఎస్ నాగన్న, ములకలేడు ఈరన్న, బిటి అశోక్, ఆర్ నాగన్న, ములకలేడు తిప్పేస్వామి, పరశురాంపురం మంజు, బిటి నారాయణమూర్తి, బీకే వెంకటేష్, బీకే రాము, దళవాయ్ ఈరన్న, ఉల్లి నగేష్, కే బాబు, ఎం వంశీకృష్ణ, ఏ రఘు, బివి అశోక్, బి రవి, ఈ కృష్ణమూర్తి, తూముకుంట మూర్తి, బంతుల నాగరాజు తదితర కుటుంబాలు పార్టీలోకి చేరాయి.