సిరాన్యూస్, కుందుర్పి
టీడీపీలో చేరిన ఏనుములదొడ్డి గ్రామ ముస్లిములు
కుందుర్పి మండలం ఏనుములదొడ్డి గ్రామంలోని ముస్లీములు శనివారం మండలం మాజీ కన్వీనర్ బోయ సన్నప్పయ్య ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకొందామని, సురేంద్ర బాబుకి ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ఎమ్మెల్యే చేసుకొందాం అన్నారు. కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు, ముస్లిములు పాల్గొన్నారు.