సిరాన్యూస్, కుందుర్పి
ల్యాండ్ డీడ్ చట్టంతో మనకు అన్యాయం : ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు
బెస్తరపల్లి లో ఎన్నికల రోడ్ షో
రాష్ట్రంలో కొత్తగా తెచ్చిన ల్యాండ్ డీడ్ చట్టంతో మన భూములను మనకు కాకుండా చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని కళ్యాణదుర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు అన్నారు.అనంతపురం జిల్లా కుందుర్పి మండలం బెస్తరపల్లింలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన కళ్యాణదుర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబుకు టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు, మహిళలు, గ్రామస్థులు పూలవర్షం కురిపించి ఘజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా అమిలినేని మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా తెచ్చిన ల్యాండ్ డీడ్ చట్టంతో తెచ్చిన మన భూములను మనకు కాకుండా చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని అన్నారు. మన భూముల పాసుపుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి ఫొటో వేసుకోవడం, రిజిస్ట్రేషన్ చేయించుకునే భూములకు ఓరిజినల్ పత్రాలు ఇవ్వకుండా జిరాక్స్ కాపీలు ఇస్తాడంటే మనకు ఏమి హక్కులు లేకుండా పోతాయని అందరు గుర్తుంచుకోవాలన్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి మూడేళ్లలోపు రోడ్లు నిర్మించి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తామని, బీటీపీ కాలువ, కుందుర్పి బ్రాంచ్ కేనాల్ పనులు రెండున్నరేళ్లలో పూర్తి చేసి సాగు, తాగు నీరిచ్చి ప్రజల రుణం తీర్చుకుంటామని తెలిపారు. గ్రామాల్లో అవసరమైన మౌళిక వసతులు కల్పించి గ్రామాలు అభివృద్ధి చేసి చూపిస్తానని పేర్కొన్నారు. పరిశ్రమల కోసం తిమ్మసముద్రం ప్రాంతంలో ఉన్న భూమిలో విద్యుత్, నీళ్ళు, రోడ్లు వేయగలిగితే పరిశ్రమలు ఏర్పాటు అవుతాయని, అందులో మన ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, మరికొదరికి ఉపాధి లభిస్తుందన్నారు. అలాగే గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించి అన్ని రకాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అందుకు మే 13న ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను మంచి మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు, కుందుర్పి మండల సీనియర్ తెలుగుదేశం పార్టీ, నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.