సిరాన్యూస్, కుందుర్పి
దేవరాజుకు ఆర్థిక సహాయం అందించిన సురేంద్రబాబు
గత కొన్ని సంవత్సరాలుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న దేవరాజు కు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు ఆర్థిక సహాయం అందించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందిర్పి మండలం ఎనుముల దొడ్డి పంచాయతీకి చెందిన రుద్రంపల్లి గ్రామ నివాసి హెచ్. దేవరాజు కిడ్నీ వ్యాధితో గత 6 సంవత్సరాలుగాబాధపడుతున్నాడు. ప్రతి నెల మందులకు గాను 5000 నుండి 7000 ఖర్చు అవుతుంది.ఇప్పటివరకు 6 లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది.అయిన కూడా నయం అవ్వలేదు.ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా మందులు వాడాలి అని దిగులు చెందుతున్నాడు.ఒక కుమారుడు 9 వ తరగతి చదువుతున్నాడు.భార్య ప్రతిరోజూ 200 రూపాయల కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.కిడ్నీ సమస్య తో బాధ పడుతున్న విషయం తెలుసుకొని కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ,జనసేన, బీజేపీ పార్టీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్టీ అమిలీనేని సురేంద్ర బాబు 10,000 (పదివేల రూపాయలు )బాధితుడు దేవరాజు కు హాస్పిటల్ ఖర్చులకోసం ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ నేపథ్యం లో బాధితుడిని చూడటానికి తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీపీ దీనమ్మ, మాజీ సర్పంచ్ కె.రామాంజినేయులు, మాజీ ఎంపీటీసీ ఓబుళపతి గారి గంగాధర, ప్రస్తుతం ఎంపీటీసీ మమత మల్లికార్జున, ఎం. మరెన్న, నాగరాజు, కొమ్మ హనుమంతరాయుడు, గరక హనుమంత తదితరులు పాల్గొన్నారు.