సిరాన్యూస్, కుందుర్పి
కార్యకర్తలకు ఎల్లప్పుడు అండగా ఉంటా: అమిలినేని సురేంద్రబాబు
* కార్యకర్తల ఆత్మీయ సమావేశం
తెలుగుదేశం పార్టీ, కార్యకర్తలకు తాము ఎల్లప్పుడు అండగా ఉంటామని కళ్యాణదుర్గం తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. బుధవారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ప్రజా వేదిక వద్ద కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కళ్యాణదుర్గం తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు హాజరై మాట్లాడారు. కళ్యాణదుర్గం ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ,కార్యకర్తలకు తాము ఎల్లప్పుడు అండగా ఉంటామని, కళ్యాణదుర్గం అభివృద్ధి కోసం నిరంతరం పాటు పడుతామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఓటమి భయంతోనే వైసీపీ దౌర్జన్యాలకు ,దాడులకు పాల్పడిందని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వైసీపీ దాడులకు పాల్పడి వారి ఓటమిని వారు ముందే అంగీకరించారని అన్నారు. వైసీపీ కార్యకర్తలను ఉసిగొల్పి దాడులు చేయడం సరికాదన్నారు. పోలీసుల భద్రతా వైఫల్యం తోనే వైసీపీ దాడులకు బరితెగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా కూడా మంచి మెజార్టీతోనే గెలుస్తున్నామని, గెలిచాక ఇచ్చిన ప్రతి హామీని కట్టుబడి ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.