Surendra Babu:అన్ని రంగాలను అభివృద్ధి చేసే బాధ్యత మాదే

సిరా న్యూస్, కళ్యాణదుర్గం
అన్ని రంగాలను అభివృద్ధి చేసే బాధ్యత మాదే
* టీడీపీ ఎంఎల్ ఏ అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు
అన్ని రంగాలను అభివృద్ధి చేసే బాధ్యత మాదేన‌ని టీడీపీ ఎంఎల్ ఏ అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. సోమ‌వారం గరుడాపురం రోడ్డు ప్రక్కన టీడీపీ ఎంఎల్ ఏ అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన శంఖారావం కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధ్యక్షులు టీసీ వరుణ్,కళ్యాణదుర్గం జనసేన ఇంచార్జ్ బాల్యం రాజేష్ హాజరయ్యారు. ఈ సందర్బంగా అమిలినేని సురేంద్ర బాబు మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధి లో 25ఏళ్ళు వెనక్కి వెళ్లిందని, టీడీపీ ప్రజా ప్రభుత్వం ఏర్పడితే అన్ని రంగాలను అభివృద్ధి చేసే బాధ్యత మాదే అన్నారు. రహదారులు నియోజకవర్గం లో చాలా అద్వానంగా తయారయ్యాయని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం లో ప్రజా ప్రతినిధులు ఏమి చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. నీరుతీసుకొచ్చేందుకు ఒక ప్రణాళిక బద్దంగా ముందుకెళ్తా అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెండాలన్న‌ కళ్యాణదుర్గం అభివృద్ధి చెప్పు నడాలన్నా టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం కావాలన్నారు. అలాగే కళ్యాణదుర్గం నియోజకవర్గం లో తనను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని ప్రజలను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *