సిరాన్యూస్, కుందుర్పి
కలిసికట్టుగా పనిచేద్దాం
*- ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు
కలిసికట్టుగా పనిచేద్దామని ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. బుధవారం అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా పని చేయాలని తెలిపారు. మీ సమస్యలు ఉన్న నేను అధికారం వచ్చిన తర్వాత ఏ సమస్య వచ్చినా నేను మీకు అందుబాటులో ఉంటానని తెలిపారు సమాజంలో చెరువులు కు నీళ్లు వచ్చేటట్లు నేను పరిష్కరిస్తానంటూ ప్రతి గ్రామానికి నీటి సౌకర్యం కల్పిస్తానంటూ చెప్పారు. ఈ సమాజంలో నా సొంత ఖర్చుతో ఏ సమస్య వచ్చినా నేను భరించుకుంటానని తెలిపారు.ప్రజలకు న్యాయం చేస్తామని, తనను గెలిపించాలని కోరారు.