చిగురుమామిడి, సిరా న్యూస్
పెండింగ్ లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని వినతి
తమ పదవీ కాలం పెంచాలని వేడుకోలు
గ్రామాల అభివృద్ధి కోసం ఖర్చు చేసిన నిధులురాక అప్పుల పాలైనందున,పెండింగ్ లో ఉన్న బిల్లులు విడుదల అయ్యే వరకు తమ పదవీ కాలాన్ని పొడిగించాలని సర్పంచులు కోరారు.శనివారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు జక్కుల రవీందర్ ఆధ్వర్యంలో సర్పంచులు ఎంపీడీవో మామిడి నర్సయ్య, ఎంపీవో శ్రావణ్ కుమార్ లను కలిసి వినతి పత్రం అందజేశారు. ఆనంతరం వారు మాట్మాలాడుతూ ట్లాడుతూ తమ గ్రామాలు అభివృద్ధిలో ముందుండాలన్న లక్ష్యంతో సీసీ రోడ్లు, పల్లె ప్రగతిలో వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలు,వల్లె పకృతి వనాలు,డ్రైనేజీలు, నూతన గ్రామపంచాయితీల భవనాల నిర్మాణాలు ఇలా చాల వరకు అప్పులు చేసి పనులు చేశామన్నారు. వాటి బిల్లులు రాక నానా ఇబ్బందులు పడుతున్నామని అవేదన వ్యక్తం చేశారు. కరోనాతో 2 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి చేయకుండా మిగిలిపోయామని, రాష్ట్ర అర్థిక అభివృద్ధి నిధులు 25 నెలలు నుంచి రావటం లేదన్నారు. 1994లో అప్పటి ప్రభుత్వం అప్పటి సర్పంచ్ లకు 2 సంవత్సరాలు పర్సన్ ఇన్చా చార్జీ లుగా పదవీ కాలం పెంచారని అదేవిధంగా తమకు ప్రజల రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు జక్కుల రవీందర్, సర్పంచులు సన్నీల్ల వెంకటేశం, గోలి బాపురెడ్డి, బెజ్జంకి లక్ష్మ ణ్, సుద్దాల ప్రవీణ్ కుమార్, బోయిని శ్రీనివాస్, ముప్పిడి వెంకట నరసింహారెడ్డి, పిట్టల రజిత శ్రీనివాస్, నాగెల్లి వకుళ లక్ష్మారెడ్డి, అందె స్వరూప స్వామి, పీచు లీల, సత్యానారయణ రెడ్డి, చెప్యాల మమత శ్రీనివాస్, గుంటి మాధవి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.