సిరా న్యూస్, భీమదేవరపల్లి
ధరణి పోర్టల్ సమస్యలపై స్పెషల్ డ్రైవ్
* డిప్యూటీ తహసీల్దార్ సూర్య
ధరణి పోర్టల్ సమస్యలపై భీమదేవరపల్లి మండలం లో అన్ని గ్రామాలలో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించినట్లు మండల డిప్యూటీ తహసీల్దార్ సూర్య తెలిపారు. ఈ సందర్భంగా భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామంలో సోమవారం ధరణి పోర్టల్ సమస్యలపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి బాధితుల దగ్గర నుండి ఫిర్యాదులు స్వీకరించారు..ఈ కార్యక్రమంలో మండల డిప్యూటీ తాసిల్దార్ సూర్య, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు, మల్లారం గ్రామపంచాయతీ సెక్రటరీ రాజు, మండల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.