సిరాన్యూస్, ఆదిలాబాద్
మహిళల రక్షణే షీటీం లక్ష్యం : షీటీం బృందం ఇన్చార్జి బి సుశీల
మహిళల రక్షణే షీటీం లక్ష్యమని ఆదిలాబాద్ షీటీం బృందం ఇన్చార్జి బి సుశీల అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జెన్సాప్ట్ కంప్యూటర్ సెంటర్ ను వారు సందర్శించారు. ఈసందర్భంగా అక్కడి కంప్యూటర్ నేర్చుకోవడానికి వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు షీటీం విధులు, సైబర్ క్రైమ్ పైన అవగాహన కల్పించారు. అనంతరం షీటీం బృందం ఇన్చార్జి బి సుశీల మాట్లాడుతూ ఎవరైనా పోకిరీలు అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, మాట్లాడిన లేదా వాళ్లతో ఫోటోలు దిగే మోసం చేసిన లేదా ఎప్పుడో దిగిన ఫోటోలను మార్ఫింగ్ చేసి వేరే వ్యక్తులకు షేర్ చేస్తానని బెదిరించిన, బ్లాక్ మెయిల్ చేసిన ఇబ్బందులకు గురి చేసిన వెంటనే టీం నెంబర్ 8712659953కి కాల్ చేయాలని, దగ్గరలోని పోలీసులను సంప్రదించాలని సూచించారు. అనంతరం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో 68 మంది విద్యార్థులు, షీటీం సభ్యులు సత్యమోహన్లు పాల్గొన్నారు.