నిందితుడి కోసం పోలీసుల గాలింపు
సిరా న్యూస్,గుంటూరు;
చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోనీ కొత్తరెడ్డి పాలెం గ్రామంలోని ప్రభుత్వపాఠశాలలో 7వ తరగతి చదువుతున్న బాలిక సోమవారం ఉదయం స్కూలుకి వెళ్లి అనారోగ్యంగా ఉందంటూ స్కూల్ నుండి వెళ్లిన బాలిక స్కూల్ టైం గడిచిపోయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో గ్రామంలో తల్లిదండ్రులు, స్థానికులు వెతుకుతుండగా గ్యాస్ గోడౌన్ లో పనిచేసే నాగరాజు ఇంటికి వెళ్లినట్టు తెలియడంతో బాలిక అన్నయ్య అతని ఇంటి కిటికీ నుంచి చూడగా బాలిక నిర్జీవంగా పడి ఉండడం కనిపించింది. దాంతో తలుపులు పగలకొట్టి బాలికను పరిశీలించగా అప్పటికే బాలిక మృతి చెందినట్టు స్థానికులు, తల్లిదండ్రులు గుర్తించారు. వెంటనే చేబ్రోలు పోలీస్ వారికీ ఫిర్యాదు చేయగా పోలీసులు వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నరు. సంఘటన స్థలాన్ని తెనాలి డిఎస్పి రమేష్ సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు. నిందితడికి కోసం గాలిస్తున్నారు.