సిరా న్యూస్,విజయవాడ;
తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ తో కార్పోరేటర్ కేశినేని శ్వేత భేటీ అయ్యారు. విజయవాడ 11 వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ గా శ్వేత వున్నారు.ఆమె తన పదవికి రాజీనామా చేసి ఆ తర్వాత టీడీపీకి రాజీనామా చేసారు. ఎంపీ కేశినేని నాని వ్యవహారంలో ముందుగా ఆయన కుమార్తె శ్వేత. రాజీనామా చేసారు. గత మున్సిపల్ ఎన్నికల్లో శ్వేత కు మేయర్ పదవి విషయంలో కేశినేని నాని అసంతృప్తి మొదలయింది. టీడీపీ గెలిస్తే శ్వేత కు మేయర్ పదవి ఇవ్వాలని ఎంపీ నాని పట్టుబట్టారు. శ్వేత కు మేయర్ పదవి ఇవ్వొద్దని మరో వర్గం వ్యతిరేకించింది. అప్పటినుంచి ఎంపీ నాని.అధిష్టానం,వ్యతిరేక వర్గంపై విమర్శలు మొదలు పెట్టారు. అయన రెండు రోజుల క్రితం తాను రాజీనామా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.