swimming: తండ్రి కొడుకులను బలిగొన్న ఈత సరదా

సిరాన్యూస్‌, కరీంనగర్
తండ్రి కొడుకులను బలిగొన్న ఈత సరదా

స‌ర‌దా ఈత తండ్రి కొడుకుల మ‌ర‌ణానికి కార‌ణ‌మైంది. ఈసంఘ‌ట‌న తిమ్మాపూర్ మండలం వచ్చునూరు గ్రామం శివారులో చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన ఎస్ ఆర్ కె పాఠశాల కరస్పాండెంట్ చాడ రంగారెడ్డి (46), అతని కుమారుడు ఓమో జయః చైతన్యానంద (9) లోయర్ మానేరు డాం తిమ్మాపూర్ మండలం వచ్చునూరు గ్రామం శివారులో నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకున్నది. చాడ రంగారెడ్డి తన ఇద్దరు కుమారులను ఈత నేర్పించడానికి మానేరు డ్యాంకు తీసుకువెళ్లగా పెద్ద కుమారుడు ఒడ్డు మీద ఉండగా నీటిలోకి దిగిన తండ్రి కొడుకులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోవడం జరిగింది. జాలర్లు ఇరువురి మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *