సిరాన్యూస్,ఖానాపూర్
మరుగుదొడ్లు నిర్మించాలని వినతి
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినుల కోసం మరుగుదొడ్లు నిర్మించాలని మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం కు ప్రభుత్వ ఉన్నత పాఠశాల పేరెంట్స్ కమిటీ ప్రతినిధి సయ్యద్ ఆయుబ్ శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మరుగుదొడ్లు లేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మున్సిపల్ ప్రభుత్వ నిధులతో చైర్మన్ ప్రత్యేక చొరవతో మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి షబ్బీర్ పాషా, తదితరులు పాల్గొన్నారు.