వడదెబ్బ తగులకుండా జాగ్రతలు తీసుకోవాలి

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

సిరా న్యూస్,జయశంకర్ భూపాలపల్లి;

వడ దెబ్బకు గురి కాకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలనిజిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు.గురువారం కలెక్టర్ ఛాంబర్ లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రజలు రోజు రోజుకు పెరుగుతున్న ఎండలకు ప్రజలువడదెబ్బకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల కర పత్రాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ఆసుపత్రుల్లో అత్యవసర మందులతో పాటుఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అన్నారు.

ఆశా,ఏ ఎన్ ఎమ్ ల వద్ద ఓ ఆర్ ఎస్ ప్యాకెట్స్ అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు, ఆశాలకు, ఏ ఎం ఎం లకుఓ ఆర్ ఎస్ ప్యాకెట్స్ పంపిణీ చేశామని తెలిపారు. ఉపాధి హామీ పథకం పనులు జరిగే ప్రాంతాల్లోను, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోను ఓ ఆర్ ఎస్ ప్యాకెట్స్ అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఉపాధి హామీ పథకం పనులు జరిగే ప్రాంతాల్లో నీడ కొరకు షేడ్ నెట్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రజలు వడదెబ్బకు గురికాకుండా పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని తెలిపారు. అత్యవసరమైతేతప్ప ప్రజలు ఇంటి నుండి బయటికి రావొద్దని, ఉదయం లేదా సాయంత్రపు వేళల్లో మాత్రమే బయటికి రావాలన్నారు. ప్రయాణాలు తగ్గించుకోవాలని, సాధ్యమైనంత వరకు చిన్న పిల్లలతో ప్రయాణం చేయొద్దనిసూచించారు. రద్దీగా ఉండే ప్రదేశాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. వ్యవసాయ కూలీలు, కార్మికులు వడదెబ్బకు గురికాకుండా తగు చర్యలు చేపట్టాలన్నారు. శీతల పానీయాలు, చల్లగా ఉండే ఆహారపదార్థాలు తగ్గించుకోవాలని తెలిపారు.

వడ దెబ్బకు గురైన వ్యక్తులకు అందించాల్సిన ప్రథమ చికిత్సపై వైద్య సిబ్బందికి అవగాహన కల్పించాలని వైద్యాదికారులను ఆదేశించారు. ఆసుపత్రుల్లో వైద్యులు అందుబాటులో
ఉండాలని అత్యవసరమైతే తప్ప సెలవులు ఇవ్వకూడదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. వడదెబ్బకు సంబంధించి ప్రతి రోజు నివేదికలు అందచేయాలని అన్నారు.
జ్యూస్ కేంద్రాలను, ఐస్ క్రీమ్నాణ్యతలను తనిఖీ చేయాలని ఆహార భద్రత అధికారులను ఆదేశించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో లేనప్పుడు వడదెబ్బ లక్షణాలు అనిపిస్తే ఒక లీటర్ నీటిలో నాలుగు స్పూన్ల పంచదార, అర స్పూన్ ఉప్పుకలిపిన ద్రావణం త్రాగడం ద్వారా ఉపశమనం లభిస్తుందని తదుపరి వెంటనే వైద్య సేవలు తీసుకోవాలని తెలిపారు. కాటన్ వస్త్రాలు ధరించాలని తెలిపారు. ప్రజలు బయటికి వెళ్లునపుడు తలకు ఎండ తగలకుండాగొడుగు, టోపి, కండువాతో తలను కప్పు కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డి ఎం హెచ్ వో డాక్టర్ మధుసూదన్, డిప్యూటీ డిఎంహెచ్ఓ కొమరయ్య,
పిఓలు శ్రీదేవి, ఉమాదేవి, డెమో శ్రీదేవి, బాశ్యనాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *