కరువు సహాయక చర్యలు చేపట్టండి

ఉచితంగా విత్తనాలు, ఎరువులు ఇవ్వాలి

200 రోజులు ఉపాధి పని కల్పించాలి

తాసిల్దార్ కు వ్యవసాయ కార్మిక సంఘం వినతి

 సిరా న్యూస్,దేవనకొండ;

గత ఖరీఫ్,రబి సీజన్లో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా తీవ్ర కరువుని నెలకొని రైతాంగానికి తీవ్ర నష్టాన్ని చూపిందని.ఈ నేపథ్యంలోనే మండలంలోని రైతులు ,రైతు సంఘాలు డిమాండ్ మేరకు మండలాన్ని కరువు ప్రకటించి పరిహారం అందజేస్తున్నారని పేర్కొన్నారు అదేవిధంగా మండలంలో కరువు సహాయక చర్యలు చేపట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వీరశేఖర్ సిఐటియు మండల కార్యదర్శి అశోక్ లు డిమాండ్ చేశారు
బుధవారం నాడు స్థానిక తహసిల్దార్ కు కరువు సమస్యలపై వినతి పత్రం అందజేశారు, ఈ సందర్భంగా వీరశేఖర్,అశోక్ లు మాట్లాడుతూ గత సంవత్సరం కరువు రైతాంగాన్ని తీవ్రంగా నష్టపరిచిందని ఎకరాకు వేలకు వేల పెట్టుబడులు పెట్టిన రైతులు తీవ్ర నష్టం చవిచూసారని అయితే ప్రభుత్వం మాత్రం అరకోర సహాయంతో రైతులకు న్యాయం చేయలేదని ఎకరాకు 20 వేల పరిహారం తో రైతులకు కాస్తయినా న్యాయం జరిగేదని వారి పేర్కొన్నారు. అదేవిధంగా కరువు ప్రకటించిన ప్రాంతాల్లో కరువు సహాయక చర్యల్లో భాగంగా ఈ ఖరీఫ్ మరియు రబీ సీజన్లో రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు ప్రభుత్వం సరఫరా చేయాలని తద్వారా రైతాంగని ఆదుకోవాలని వారి కోరారు అదేవిధంగా నకిలీ విత్తనాలు,మందుల బెడద నుండి రైతులను కాపాడుకునేందుకు అధికారులు నిత్యం విత్తనాలు, ఎరువులు దుకాణాలపై తనిఖీలు నిర్వహించి అక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు అదేవిధంగా పూర్తిగా వ్యవసాయ పనుల మీద ఆధారపడుతున్న కూలీలకు పనులు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని 200 రోజుల పని దినాలు కల్పించాలని వారు కోరారు ఈ సందర్భంగా తాసిల్దారు గారు మాట్లాడుతూ ఈ సమస్యలపై ఉన్నతా అధికారులకు విన్నవించి పరిష్కారానికి తగు కృషి చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రామాంజనేయులు ,రాముడు, నాగన్న ,వీరంజి తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *