పోషకాహార ఆహార పదార్థాలను తీసుకోవాలి ..!

ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్ట్ పీడీ రవూఫ్ ఖాన్

సిరా న్యూస్,కమాన్ పూర్ ,
గర్భిణీలు, బాలింతలు పోషకాహార విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పీడీ రవూఫ్ ఖాన్ అన్నారు. కమాన్ పూర్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని సమావేశంలో శనివారం నిర్వహించిన పోషణ ఫక్వాడా కార్యక్రమాన్ని అంగన్ వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అన్నప్రాశన ,  అక్షర అభ్యాసం, గర్భిణీలకు శ్రీమంతంతో పాటు తల్లులకు పోషహార విలువల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గర్భిణీలు బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం వల్ల పండంటి బిడ్డకు జన్మనిస్తారాన్నారు. పిల్లల తల్లులకు ఇచ్చిన గ్రోత్ కార్డులో బరువు సూచించిన విధంగా ఉండాలని, ప్రతి నెల పిల్లలను అంగన్ వాడీ కేంద్రాలకు తీసుకువచ్చి పిల్లల బరువు, ఎత్తులను తనిఖీ చేయాలని సూచించారు. అంతేకాకుండా పిల్లల బరువు, ఎత్తు పెరిగేలా తల్లులు ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు. అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఆట పాటలతో విద్యాబోధన చేయడం జరుగుతుందన్నారు. అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లలను టీచర్లు తల్లులుగా చూస్తారన్నారు. అలాగే పోషణ – పక్వాడా కార్యక్రమంలో భాగంగా చిరు ధాన్యాలపై కిషోర్ బాలికకలకు, గర్భిణీలకు, తల్లులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సిడిపిఓ స్వరూప అంగన్ వాడీ సూపర్ వైజర్ లు , శారద అనిత లక్ష్మి టీచర్లు, గుమ్మడి శారద లక్ష్మీ రబియా జయసుధ అమల మణి నాగ సరోజ శివ నాగాంజలి పద్మ విజయలక్ష్మి భాగ్య షరీఫ్ నిసా గర్భిణీలు, తల్లులు , కోషార్ బాలికలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *