జిల్లా కలెక్టర్ డా.జి.సృజన
సిరా న్యూస్,కర్నూలు;
బ్యాంకుల ద్వారా ఎటువంటి అనుమానాస్పదమైన లావాదేవీలు జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన బ్యాంకర్లను ఆదేశించారు.
*శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకుల ద్వారా నగదు లావాదేవీలు, పోస్టల్ కార్డుల డిస్పాచ్ పై బ్యాంకర్స్, పోస్టల్ సిబ్బందితో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికలకు సంబంధించి ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నందున నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎన్నికల వ్యయ నిర్వహణ కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అమలులోకి వస్తుందన్నారు. ఎప్పుడైతే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందో అప్పటి నుంచి మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడానికి గాను ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా వారి ఓటు హక్కును స్వేచ్చగా నిర్వహించాడం ఎన్నికల కమీషన్ ఉద్దేశ్యం కాబట్టి బ్యాంకులు కూడా ఆ కారణంగా ప్రముఖంగా ఉంటాయన్నారు. అందుకుగాను బ్యాంకులు నగదు లావాదేవీలకు సంబంధించి కూడా కొన్ని నియమ నిబంధనలు పాటించాలన్నారు.
👉 *ఏదైనా బ్యాంకు ఖాతా నుంచి గత రెండు నెలలుగా లక్ష అంతకు మించిన నగదు లావాదేవీలు (డిపాజిట్/విత్ డ్రా) లేని ఖాతాలో ఉన్నట్టుండి నగదు డిపాజిట్/విత్ డ్రా చేసినట్లయితే సదరు బ్యాంకు ఖాతాను అనుమానాస్పద ఖాతాగా గుర్తించి బ్యాంకర్లు వెంటనే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకొని రావాలన్నారు. అలాంటి ఖాతాలను ఎన్నికల వ్యయ నిర్వహణ సభ్యులు ఎల్డిఎం, నోడల్ అధికారులతో విచారణ చేయించడం జరుగుతుందన్నారు.
👉 *బ్యాంకు ఖాతా నుంచి ఆన్లైన్ (అర్టిజీస్) విధానం ద్వారా ఒకే సారి ఎక్కువ మంది ఖాతాలకు గతంలో ఎన్నడూ జరగని ఆన్లైన్ లావాదేవీలు జరగకుండా ఉండి ఉన్నట్టుండి జరుగుతున్న ఆన్లైన్ లావాదేవీలకు సంబంధించిన వివరాలను కూడా బ్యాంకులు నివేదిక అందజేయాలన్నారు.
👉 *అభ్యర్థి బ్యాంకు ఖాతా, అభ్యర్థి భార్య/భర్త, అభ్యర్థి డిపెండెంట్స్ సంబంధించి వారు నామినేషన్ వేసే సమయంలో అఫిడవిట్ లో పొందుపరిచిన బ్యాంకు ఖాతాల నుండి లక్ష అంతకు మించి డిపాజిట్/విత్ డ్రా చేసినట్లయితే అందుకు సంబంధించిన వివరాలను కూడా బ్యాంకర్స్ ఇవ్వాలన్నారు.
====================