డయేరియా ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోండి

వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్
సిరా న్యూస్,విజయవాడ;
డయోరియా ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యకమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. నీరు కలుషితం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. గ్రామీణ ప్లాంతాల్లో 271 వాటర్ సోర్సెస్ ను గుర్తించాం. లీకేజీల కారణంగానే నీరు కలుషితమవుతోంది. నీటి కలుషిత ప్రాంతాల్లో తక్షణ చర్యలు తీసుకోవాలి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు మున్సిపల్ శాఖలతో వైద్య ఆరోగ్య శాఖాధికారులు సమన్వయం చేసుకోవాలని అన్నారు. డయేరియా విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలి. జూలై 1 నుండి ఆగస్టు 31 వరకు డయేరియా నియంత్రణపై ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలి. డయేరియా నియంత్రణపై ప్రజల్లో అవగాహన కలిగించాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దు. డయేరియా బాధితులకు సత్వరమే వైద్య సేవలు అందించాలి. అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని అన్నారు.
=======

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *